ప్రాజెక్టులు వేగంగా ముందుకెళ్లడానికి నోట్ల రద్దే కారణం!: మోదీ

  • నోట్ల రద్దు వల్ల గోనె సంచుల్లోని డబ్బు బయటకు వచ్చింది
  • అందుకే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి
  • కాంగ్రెస్ పార్టీ వల్లే ఛత్తీస్ గఢ్ అభివృద్ధికి నోచుకోలేదు
పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీ మరోసారి సమర్థించుకున్నారు. చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, నోట్ల రద్దు వల్లే అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ముందుకు వెళ్లాయని చెప్పారు. ఇంత వేగంగా మీరు పనులు ఎలా చేస్తున్నారని తనను అందరూ అడుగుతుంటారని... రైల్వేలు, స్కూళ్లు, విద్యుద్దీకరణ, రోడ్ల నిర్మాణాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నిస్తుంటారని... దీనికి సమాధానంగా డబ్బు ఎప్పటి నుంచో ఉందని చెబుతుంటానని తెలిపారు. గతంలో ఈ డబ్బును కొందరు గోనె సంచుల్లో దాచుకునేవారని... నోట్ల రద్దు వల్ల ఆ డబ్బంతా బయటకు వచ్చిందని చెప్పారు. అందుకే ఇంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే చత్తీస్ గఢ్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
Go Back to Shorts
modi
chattisgharh
bilaspur
demonitisation

More Telugu News